వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-6: పదవ తరగతి విద్యార్థుల పరీక్షల తర్పీదు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వందరోజుల కార్యక్రమం పురోగతిని పరిశీలించేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డి.ఒ. పి. వీరేంద్ర ఈరోజు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, పరీక్షలపై సమగ్ర దృష్టి పెట్టాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమూల్యమైన సూచనలు అందించారు. హెచ్‌.యం‌.కం. ప్రిన్సిపాల్ ఎ. పి. లలిత మాట్లాడుతూ, ఎం.పి.డి.ఒ. సందర్శన పాఠశాల సిబ్బంది, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. అనంతరం ఎం.పి.డి.ఒ. వీరేంద్ర, ఉపాధ్యాయులు జె. భాస్కర్ రెడ్డి, కనకాచారి, చిట్టిబాబు, కె. భారతిలతో సమావేశమై మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధతో తర్పీదు అందించాలి, వారి భవిష్యత్తు మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సువర్ణ, వెల్ఫేర్ అసిస్టెంట్ కవితలు పాల్గొన్నారు. పాఠశాల వందరోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఎం.పి.డి.ఒ. పాఠశాల సిబ్బందికి స్పష్టం చేసినట్లు పాఠశాల వర్గాలు తెలియజేశాయి.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర