తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15

సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె, సెట్టేరి, నల్లంగాడు పంచాయతీల పరిధిలోని గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పాల్గొన్నారు అంతకుముందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్ కి బంగారుపాళ్యం మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే  గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సుపరిపాలలో తోలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం గ్రామంలో ప్రజలతో సమావేశమైన ఆయన స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తే… మరికొన్నిటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా పింఛన్, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ప్రజలను తీశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, వైసీపి ప్రభుత్వం పాలనకు, కూటమి ప్రభుత్వం పాలనకు ప్రజలకు వ్యతాసం చెబుతూ..”ఇది ఓ మంచి ప్రభుత్వం అంటూ ఆశీస్సులు అందిస్తూ, ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పక్షపాతం చూపకుండా సాగుతున్న పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, గంధరనెల్లూరు నియోజకవర్గం పరిశీలకులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎన్.పి.జయచంద్ర నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్  నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జనార్థన్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///