సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

మన న్యూస్ సింగరాయకొండ:-
పేద, మధ్యతరగతి వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సింగరాయకొండ కందుకూరు రోడ్డులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మరియు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “అన్నదానం మహాదానం అనే భావనతో ప్రతి పేద వ్యక్తికీ గౌరవమైన భోజనం అందించాలన్న దృక్కోణంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించబడ్డాయి,” అని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా, అందులో భాగంగా సింగరాయకొండలో ప్రారంభం కాబోయే ఈ క్యాంటీన్ స్థానిక ప్రజలకు ప్రతి రోజు కేవలం ₹5కే నాణ్యమైన, పోషకాహార భోజనం అందించనుంది. ఇందులో ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ క్యాంటీన్ ద్వారా పేదలకు ₹5కు భోజనం లభించడం, ప్రభుత్వ సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..