

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై కార్మిక వర్గం ఐక్యంగా జూలై 9న సమ్మెకు వెళుతుందని సిఐటియు తెలిపింది.జూలై 9 సమ్మె కు కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తూ జిల్లాలోని జీపు యాత్ర ప్రతినిధులు పాచిపెంటకు చేరుకున్నారు.పనుకువలస మరియు పాచిపెంటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి జ్యోతిలక్ష్మి ప్రసంగించారు. అలాగే సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారావు మన్మధ మాట్లాడారు.
దేశంలో కార్మిక వర్గం హక్కులు కాపాడుకునేందుకు పెద్దఎత్తున అన్ని సంఘాల్లో ఉండే కార్మిక వర్గం జూలై 9న సమ్మెలో పాల్గొంటుందని పార్లమెంట్లో పార్లమెంటు బయట బిజెపి ప్రభుత్వాలు మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాయడమే పనిగా పెట్టుకుందని అందులో భాగంగానే పని గంటలు పెంచాలని చూస్తుందని స్కీమ్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఇంద్ర ఎన్ వై నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు పెంచకుండా ఉన్న పథకాలు తీసివేసే కార్యక్రమం చేస్తుందని అందులో భాగంగానే సంక్షేమ పథకాలు కుదించిందని చిరుద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు జీతాలు పెంచకుండా వెట్టిచాకి చేయిస్తుందని విమర్శించారు కార్మిక వర్గంతో ఏకమై జూలై 9న సమ్మెకు సిద్ధపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రాము, పాచిపెంట మండల నాయకులు పార్వతి బంగారమ్మ రవణమ్మ పెద్ద ఎత్తున స్కీం వర్కర్లు పాల్గొన్నారు.