

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఏడాది పాలన దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొనియాడారు. మంగళవారం 43వ డివిజన్ లో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి
ఆర్ పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోందని, అభివృద్ధి సంక్షేమములో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోంది అన్నారు. మహిళలకు అన్ని సదుపాయాలు సమకూర్చి, వృద్ధులకు పెన్షన్ 4 వేలకు ఒకటవ తారీకే అందజేయడం జరుగుతుందన్నారు. నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నిత్యవసర సరుకులు ఒక్కసారి పట్టకుండా అందాలన్న లక్ష్యముతోనే 15 రోజులు పాటు రేషన్ షాపుల్లో ఇచ్చేలా ఏర్పాట్లు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎంతో విజయవంతంగా పూర్తి కావస్తోందని, ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారన్నారు. టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్, శీను వెంకట్ రెడ్డి, ప్రసాద్, నళిని వెంకటేష్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్రీనాథ్ చౌక దుకాణం డీలర్ పావని రమణ పాల్గొన్నారు.