శ్రీ వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలకు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్…!

హైదరాబాద్,మన న్యూస్ : మెట్ట ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఈనెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆయన నివాసమైన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో సోమవారం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి గురవయ్య నాయుడు, శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా తరలిరావాలని ఆహ్వానం అందించారు. ముందుగా పుష్పగుచ్చం అందజేసి వెంకయ్య నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రెండు గంటల పాటు సుదీర్ఘంగా దేశ, రాష్ట్రాల రాజకీయాలు, ఉదయగిరి అభివృద్ధి పై ఎమ్మెల్యే గారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఉదయగిరి అభివృద్ధికి ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని, ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్న నాకు తెలియజేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలియజేశారు. ఉదయగిరి ప్రాంతం పాతతరం నాయకుల పేర్లతో సహా తెలియజేసి వారందరిని అడిగినట్లు తెలియజేశారు. అందరినీ కలుపుకొని పోతూ ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి