హైదరాబాద్,మన న్యూస్ : మెట్ట ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఈనెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆయన నివాసమైన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో సోమవారం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి గురవయ్య నాయుడు, శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా తరలిరావాలని ఆహ్వానం అందించారు. ముందుగా పుష్పగుచ్చం అందజేసి వెంకయ్య నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రెండు గంటల పాటు సుదీర్ఘంగా దేశ, రాష్ట్రాల రాజకీయాలు, ఉదయగిరి అభివృద్ధి పై ఎమ్మెల్యే గారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఉదయగిరి అభివృద్ధికి ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని, ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్న నాకు తెలియజేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలియజేశారు. ఉదయగిరి ప్రాంతం పాతతరం నాయకుల పేర్లతో సహా తెలియజేసి వారందరిని అడిగినట్లు తెలియజేశారు. అందరినీ కలుపుకొని పోతూ ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.