బింగినపల్లి గ్రామస్తుల సమస్యలకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పందన

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీకి చెందిన గ్రామస్తులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడ్ పంచాయతీ పరిధిలో పెద్దల నుండి సంక్రమించిన భూముల్లో కొంత భాగాన్ని అమ్ముకున్నారని, మిగిలిన భూములకు పాస్ పుస్తకాలు ఇప్పించాల్సిందిగా మంత్రి గారిని కోరారు. అలాగే, కొందరు అక్రమంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి ఆ భూములపై హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు.ఈ నేపథ్యంలో మంత్రి గారు ఇరు వర్గాలను పిలిపించి వాస్తవాలు పరిశీలించి, పెద్దల కాలం నుండి హక్కు కలిగిన వారికి అధికారులతో మాట్లాడి పాస్ పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాల సమస్యలను మంత్రి గారికి వివరించగా, వెంటనే అధికారులతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో బింగినపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి, మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    Mana News :- ఏపీ రాష్ట్ర చరిత్రలోనే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. వీరిలో వైకాపా సానుభూతి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమోషన్లలో ఎలాంటి తారతమ్యాలు కల్పించ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.కానీ ప్రభుత్వ ఉద్యోగులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): సృష్టికి ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ధిగాంచినవి పల్లె పట్టుకొమ్మలు… చక్కని ప్రకృతి లో వ్యవసాయం చేస్తూ, తమ పిల్లలను బడికి పంపుతున్న బుల్లి రోడ్లో పెద్ద పెద్ద వాహనాలు… గత కొన్ని సంవత్సరాలుగా భారీ లోడుతో నిత్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి