ప్రజా సమస్యలపై జేసీని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్..

చౌకధర దుకాణాల్లో సరుకులు తక్కువ ఇచ్చిన లేక అలాట్మెంట్ తక్కువ ఇచ్చినట్లు చెప్పిన వేంటనే ఫిర్యాదు చేయండి..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చౌకధర దుకాణాల వద్ద సరుకుల అందకపోవడంపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్పందించారు. గత కొంతకాలంగా చౌకధర దుకాణాల్లో అలాట్మెంట్ తక్కువగా వస్తోందని, సరుకులు పూర్తిగా ఇవ్వడం లేదని తెలుసుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ విద్యాధరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జేసీతో సమావేశమైన ఎమ్మెల్యే అలాట్మెంట్ తక్కువగా రావడం, సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జేసీ కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వారి వివరాలు ఇవ్వాలని, వేంటనే చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూతలపట్టు నియోజకవర్గంలో చౌకధర దుకాణాల్లో అక్రమాలు ఎక్కడైనా జరిగిన, అలాట్మెంట్ తక్కువగా ఉందని చెప్పిన ఉపేక్షించవద్దని, వెంటనే ప్రజలు తనకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొప్ప ఆశయంతో చేపట్టినట్లు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి