చౌకధర దుకాణాల్లో సరుకులు తక్కువ ఇచ్చిన లేక అలాట్మెంట్ తక్కువ ఇచ్చినట్లు చెప్పిన వేంటనే ఫిర్యాదు చేయండి..
మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చౌకధర దుకాణాల వద్ద సరుకుల అందకపోవడంపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్పందించారు. గత కొంతకాలంగా చౌకధర దుకాణాల్లో అలాట్మెంట్ తక్కువగా వస్తోందని, సరుకులు పూర్తిగా ఇవ్వడం లేదని తెలుసుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ విద్యాధరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జేసీతో సమావేశమైన ఎమ్మెల్యే అలాట్మెంట్ తక్కువగా రావడం, సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జేసీ కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వారి వివరాలు ఇవ్వాలని, వేంటనే చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూతలపట్టు నియోజకవర్గంలో చౌకధర దుకాణాల్లో అక్రమాలు ఎక్కడైనా జరిగిన, అలాట్మెంట్ తక్కువగా ఉందని చెప్పిన ఉపేక్షించవద్దని, వెంటనే ప్రజలు తనకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొప్ప ఆశయంతో చేపట్టినట్లు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు