ప్రజా సమస్యలపై జేసీని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్..

చౌకధర దుకాణాల్లో సరుకులు తక్కువ ఇచ్చిన లేక అలాట్మెంట్ తక్కువ ఇచ్చినట్లు చెప్పిన వేంటనే ఫిర్యాదు చేయండి..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చౌకధర దుకాణాల వద్ద సరుకుల అందకపోవడంపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్పందించారు. గత కొంతకాలంగా చౌకధర దుకాణాల్లో అలాట్మెంట్ తక్కువగా వస్తోందని, సరుకులు పూర్తిగా ఇవ్వడం లేదని తెలుసుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ విద్యాధరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జేసీతో సమావేశమైన ఎమ్మెల్యే అలాట్మెంట్ తక్కువగా రావడం, సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జేసీ కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వారి వివరాలు ఇవ్వాలని, వేంటనే చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూతలపట్టు నియోజకవర్గంలో చౌకధర దుకాణాల్లో అక్రమాలు ఎక్కడైనా జరిగిన, అలాట్మెంట్ తక్కువగా ఉందని చెప్పిన ఉపేక్షించవద్దని, వెంటనే ప్రజలు తనకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొప్ప ఆశయంతో చేపట్టినట్లు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..