ముత్తరపల్లెలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..

మన న్యూస్ తవణంపల్లె జూన్-1

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె గ్రామానికి చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్”* తవణంపల్లె మండల తహసీల్దారు సుధాకర్ మరియు మండల నాయకులు పుష్ప గుఛ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముత్తరపల్లె గ్రామంలో రేషన్ షాపులో సామాన్య ప్రజలకు బియ్యం పంపిణీ చేసారు. అనంతరం గ్రామంలో 65 ఏళ్ళు పైబడిన వృద్దులు, వికలాంగుల ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే స్వయంగా బియ్యం అందజేశారు. అనంతరం రేషన్ షాపులోని సరుకుల నిల్వ, తూకాల కొలతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధానాలతో లబ్ధిదారులు వెళ్ళిన సమయానికి రేషన్ షాపు సరుకులు అందేవి కాదని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందించాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలు గుర్తించి పాత పద్దతిని అమలు చేస్తూ ఒక‌ మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రతి  నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకూ రేషన్ షాపుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో రేషన్ అందించడం జరుగుతుందని, అదేవిధంగా 65 సంవత్సరాల పైబడిన వృద్దులకు, వికలాంగులకు ఇంటికి రేషన్ సరుకులు అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల తహసీల్దారు సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె మండల టిడిపి అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, క్లస్టర్ ఇంఛార్జ్ మోహన్ నాయుడు,  టిడిపి‌ నాయకులు ప్రవీణ్ కుమార్ నాయడు, పట్నం గోపి, లవకుమార్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..