వీధి నాటకాలతో వైసిపి కుట్ర-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

Mana News, Tirupati :- గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేతిలో చావు దెబ్బ తిన్న వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నాటకాలతో కుట్రలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. స్వతహాగా నాస్తికుడు, హిందూ ద్వేషి అయిన కరుణాకర్ రెడ్డి వంటి వారు టిటిడి పైన, గోవిందుని పైన చేస్తున్న విషపూరితమైన కుట్రలను పటాపంచలు చేయడానికి, భక్తులలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి గోశాల వద్దకు చేరుకున్న ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే లకు, నాయకులకు సంఘీభావంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.ఇంటి ముందు హౌస్ అరెస్ట్ డ్రామాలు ఆడుతూ, ఫేక్ రాజకీయం చేస్తున్న భూమనకు గోశాలకు వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ ఫేక్ నాటకాలు ఆడటం, వెయ్యి మందితో గోశాలకు వెళ్తే గోవులు బెదిరిపోతాయని, లిమిటెడ్ గా వెళ్ళాలని పోలీసులు చెప్తున్నా వినకుండా, ఎవరూ ఆపకపోయినా రోడ్డు మీద దొర్లుతూ భూమన హై డ్రామా ఆడటాన్ని హిందూ సమాజం గమనించిందని తెలిపారు.జగన్ మార్గదర్శకత్వంలో ఫేక్ డ్రామాలు ఆడుతున్న భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు చెప్పినప్పటికీ, భూమన కుటుంబం, పార్ట్ టైం నటి రోజా తదితరులు ఫేక్ డ్రామాలు ఆడటం ఆపాలని హితవు పలికారు.ధర్మ విరుద్దమైన ప్రవర్తనతో గత కొన్ని రోజులుగా టిటిడి వ్యవహారాలపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసిపి వారికి గోశాలలోని వాస్తవాలను చూపెడతామని ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భూమన మరియు ఇతర నాయకులను ఆహ్వానించినప్పటికీ, వారికి వచ్చే దమ్ము లేక వీధుల్లో పొర్లుతూ నాటకాలాడి పలాయనం చిత్తగించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తిరుపతి పార్లమెంటు నాయకులు వజ్రం కిషోర్, రామచంద్రయ్య, మునిరెడ్డి, చింతగింజల సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..