

నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ 24, 28 మరియు 30వ డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి ఆదివారం శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నగర కార్పోరేషన్ పరిధిలో 26 డివిజన్లకు సంబంధించినవని, వీటి అంచనా విలువ షుమారు 40 కోట్ల రూపాయలని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో, 18 గ్రామాలలో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని, ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులు చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, మునిసిపల్ శాఖ మంత్రివర్యలు పొంగూరు నారాయణ కి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని అన్నారు.అక్షరాల 60 రోజుల్లో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు పూర్తిచేసి, మే 20వ తేదీన ప్రజలకు అంకితం చేస్తాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని తెలిపారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
