విశ్వవిజేతగా టీమిండియా.. వికెట్లతో దాండియా ఆడిన కోహ్లీ, రోహిత్!

Mana News :- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీ, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు సంతోషంతో ఎగిరి గంతేసారు. బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేసిన రవీంద్ర జడేజా.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో కలిసి గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్లతో దాండియా ఆడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ హగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లకు సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా… మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు