ఐసీసీ ఫైనల్స్.. సెంచరీ బాదిన ఏకైక భారత బ్యాటర్‌

Mana News :- ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు తగ్గట్టుగా ఈ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఏకంగా 14 సెంచరీలు నమోదయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక సీజన్‌లో ఇదే అత్యధికం. విల్ యంగ్, టామ్ లేథమ్, తౌహిద్ హృదోయ్‌, శుభ్‌మన్ గిల్, రికెల్‌టన్, బెన్ డకెట్, జోష్ ఇంగ్లిస్, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జద్రాన్, జో రూట్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ సెంచరీలు బాదారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర రెండు శతకాలు సాధించాడు. ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లోనూ శతకాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌ సెంచరీ చేసే ఛాన్స్‌ ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర మరోసారి శతక్కొట్టే అవకాశాలున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో టీమ్ఇండియా తరఫున ఒక్కడే సెంచరీ బాదాడు. ఆ ఒకే ఒక్కడు ఎవరంటే మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly). భారత్ తరఫున దాదా మినహా ఎవరూ ఐసీసీ టోర్నీల్లో మూడంకెల స్కోరు అందుకోలేదు. దాదా ఎప్పుడు చేశాడంటే? 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నైరోబీ వేదికగా జరిగింది. ఈ టైటిల్ పోరులో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. కెప్టెన్ సౌరభ్ గంగూలీ (117; 130 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకం బాదాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్‌ తరఫున నమోదైన ఏకైక సెంచరీ ఇదే. ఆ మ్యాచ్‌లో సచిన్ (69) కూడా రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రిస్ కెయిర్న్స్ (102) శతకానికితోడు క్రిస్ హారిస్ (46), నాథన్ ఆస్లే (37) పరుగులు చేయడంతో కివీస్‌ రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆ అవార్డూ ఒక్కడికే :- భారత్ ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ ఐదుసార్లు ఫైనల్‌కు చేరింది. 2002లో భారత్, శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలవగా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ఇండియా ఛాంపియన్‌గా అవతరించింది. ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లు :-వీరేంద్ర సెహ్వాగ్ – 82; 81 బంతుల్లో (ఆస్ట్రేలియాపై, 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్), సౌరభ్ గంగూలీ – 117; 130 బంతుల్లో (న్యూజిలాండ్‌పై, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000 ఫైనల్) ,గౌతమ్ గంభీర్ – 97; 122 బంతుల్లో (శ్రీలంకపై, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్) ,మహేంద్ర సింగ్ ధోనీ – 91*; 79 బంతుల్లో (శ్రీలంకపై, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌) ,అజింక్య రహానె – 89; 129 బంతుల్లో (ఆస్ట్రేలియాపై, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, తొలి ఇన్నింగ్స్‌లో)

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 6 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 7 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 6 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు