ఆంధ్రప్రదేశ్‌పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Mana News, న్యూఢిల్లీ, మార్చి 03: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక నీటిని తీసుకుంటోందని ఆయన విమర్శించారు.నీటి తరలింపును అడ్డుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు తెలంగాణ ఎంపీలతోపాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపు, వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఇటీవల జరిగిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సంఘటనను సైతం మంత్రికి వీరు సోదాహరణగా వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కార్యాలయం వెలుపల సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చేపడుతోన్న బనకచర్లపై తమ అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలియజేశామన్నారు.అయితే ఏపీ నుంచి ఈ బనకచర్ల ప్రాజెక్ట్‌పై తమకు ఎలాంటి డీపీఆర్ రాలేదని మంత్రి వివరించారని చెప్పారని తెలిపారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క – సారక్క ప్రాజెక్టులకు.. త్వరగా నీటి కేటాయింపులు చేయాలని మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. ఇక తమ ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) క్లియరెన్స్ ఇంకా రాలేదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామని చెప్పారు. గోదావరి జలాలను అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. సమ్మక్క సారక్క, సీతారామ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంత వరకు జరగలేదని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతోందంటూ ఏపీపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రాజెక్టులకు, శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతే నికర జలాలు ఉన్నాయనేది లెక్క తేలుతుందని ఆయన వివరించారు.తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాత ఇతర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి వరద జలాలను బనకచర్లకు తరలిస్తామని అంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇక నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌, శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకు వెళ్తున్న అధిక జలాలను ఆపాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను తాము కోరామన్నారు. కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకొని ఈ అన్యాయాన్ని ఆపాలని ఆయనకు విజ్జప్తి చేశామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.గోదావరిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తాము అభ్యంతరం చేప్పామని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపై ఏపీ నుంచి ఎటువంటి నివేదిక రాలేదని.. ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు అధిక నీరు ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామ సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు నిధులు సైతం ఇవ్వాలని తాము అడిగాని వివరించారు.అలాగే కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అవసరమైతే.. టెలీమెట్రీల కోసం తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు సైతం తామే భరిస్తామని కేంద్రానికి స్పష్టం చేశామని వివరించారు. తమ ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారన్నారు.మరోవైపు ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరామన్నారు. అలాగే మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (NDSA ) నుంచి త్వరగా నివేదిక అందేలా ఆదేశించాలని విజ్జప్తి చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ జల వనరుల విషయంలో కేంద్రం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, తాను.. బలమైన వాదనలు వినిపించామని తెలిపారు.కృష్ణా జలాల వివాదంలో రోజు వారీగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చిందని చెప్పారు. అదే విధంగా దీర్ఘకాలికంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కోరాన్నారు. తుమ్మడిహట్టి సమీపంలో గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించి పనులు మొదలు పెట్టనున్నామన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రంతో చర్చించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు.

Related Posts

పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:-  కొండాపూర్ డివిజన్  పరిధిలోని  గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ  హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్  నిధులతో  రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…

పహాల్గమ్ ఉగ్ర దాడిని కండించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

మన న్యూస్ నర్వ :- *నిన్న సాయంత్రం కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, పహెల్గాంలో  కొంత మంది పాకిస్థాన్ ఉగ్రమూకలు అమాయకులైన 28 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కంట తడి పెట్టించే విదంగా చేసిందని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి