జిల్లా సైన్స్ ఎక్స్ పో లో ప్రతిభ చాటిన విద్యార్థులకు గీతం యాజమాన్యం అభినందన

*బట్టీ చదువులు కాదు పరిశోధనాత్మక విద్య అవసరం.**గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు.* మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-బట్టీ చదువులు కాకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను శాస్త్ర వేత్తలుగా తీర్చి దిద్దేందుకు పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు పరిశోధనాత్మక విద్య ను అందిస్తూ సింగరాయకొండ గీతం విద్యాసంస్థల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభను చాటారు. జిల్లా కేంద్రం లో గురువారం జిల్లా స్థాయిలో క్విజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ ఎస్ ఆర్ ఒ లు సంయుక్తంగా సైన్స్ ఎక్స్పో,డ్రాయింగ్,పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో జిల్లా లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో సింగరాయకొండ గీతం విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని తమ తమ పరిశోధనలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల్లో గీతం విద్యాసంస్థల కి చెందిన విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానం సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించిన నిర్వాహకులు ఐ ఎస్ ఆర్ ఒ టీం స్పందిస్తూ తీర ప్రాంత గ్రామాల లో జిల్లా స్థాయి లో సత్తా చాటే బాల శాస్త్ర వేత్తలను తీర్చి దిద్దే గీతం విద్యాసంస్థల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా గీతం విద్యాసంస్థల నిర్వాహకులు లక్ష్మణ రావు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల విద్యార్థులు బట్టి చదువులు కాకుండా చిన్న వయసు నుండే పరిశోధనాత్మక, ప్రయోగాత్మక విద్య, అవగాహన కి ప్రాధాన్యం ఇస్తూ తమ లోని మేధస్సుకు పదును పెడుతున్నారని దాని ఫలితంగానే జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్పో లో ప్రథమ స్థానం సాధించ గలిగారని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు కృషిచేసిన తమ బోధన సిబ్బందిని, ప్రిన్సిపాల్ తాజుద్దీన్ లను ఆయన అభినందించారు. సింగరాయకొండ గీతం విద్యాసంస్థల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పో లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను లైన్స్ క్లబ్ ఆఫ్ ఎస్ కొండ అభినందించింది.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?