మన ధ్యాస న్యూస్:-

సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో జరిగింది. తెలుగు అధ్యాపకులు ఆర్. వెంకట్రావు మాట్లాడుతూ “తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిబింబం. భాషా గౌరవాన్ని కాపాడటం ప్రతి విద్యార్థి బాధ్యత” అని పిలుపునిచ్చారు. సివిక్స్ అధ్యాపకులు కోటేశ్వరరావు తెలుగు పాండిత్యం, సాహిత్యం విశిష్టతను వివరించి, విద్యార్థుల్లో గర్వభావాన్ని రేకెత్తించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ శంకరరావు అధ్యక్షులుగా వ్యవహరించారు. “క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యం, జట్టు భావనను పెంపొందిస్తాయి. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి” అని విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపాల్ సౌజన్య మాట్లాడుతూ, “విద్యార్థులు విద్యలో మాత్రమే కాక, క్రీడలలోనూ ప్రతిభ కనబరచి భవిష్యత్తులో సమగ్ర వ్యక్తిత్వాన్ని సాధించాలి” అని ఆవేశభరితంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *