20, 21 సచివాలయాలలో P4 అవగాహన సదస్సు…..ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, మస్తాన్ నాయుడు లు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 20 మరియు 21 సచివాలయాలలో జరిగిన P4 అవగాహన సదస్సులు సచివాలయాల అడ్మిన్ లు జీవిత మరియు ధనలక్ష్మీ ల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం మరియు గూడూరు పట్టణ ఉపాధ్యక్షుడు ఆరికట్ల మస్తాన్ నాయుడు లు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంతో P4 కార్యక్రమం చేపట్టారని, సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు మరియు ఎన్.ఆర్.ఐ. లు ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన ఈ P4 కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించి , పేదరికంలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకొని, వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పేదరికంలో ఉన్న లబ్ది దారులు తమ పేర్లు సచివాలయంలో నమోదు చేసుకోవాలని, సచివాలయం సిబ్బంది నిజమైన అర్హులను గుర్తించి జాబితాను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పరమేశ్వర గౌడ్, శంకర్ నాయుడు, కేశవ్, శ్రీదేవి ,సరస్వతమ్మ, పర్వీన్, ఛాంద్ బాషా, లక్ష్మణ్, అశోక్, కిషోర్, హరికృష్ణ,ముజఫర్, సచివాలయాల సిబ్బంది మరియు ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..