రైలు పట్టాలు దాటుతూ టిడిపి నాయకుడు బుజ్జా సుబ్బయ్య దుర్మరణం– సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్:- రైలు పట్టాలు దాటుతూ గూడూరు రెండో పట్టణ 27వ వార్డు ప్రధాన కార్యదర్శి బుజ్జ వెంకటసుబ్బయ్య దుర్మరణం చెందిన సంఘటన సోమవారం గాంధీ నగర్ సమీపంలోని రైలు పట్టాలపై చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు బొజ్జ వెంకటసుబ్బయ్య తనకి ఉన్న మూగజీవాలను మేపుకుంటూ రైలు పట్టాలు పై వెళ్లే క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బొజ్జ వెంకటసుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, గూడూరు రెండో పట్టణంలోని 27వ వార్డు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.ఆయన మృతి పట్ల గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సంతాపం తెలిపారు.

Related Posts

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

మన న్యూస్, సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు మున్సిపాలిటీ పరిధి లో ఇంజనీరింగ్ కార్మికులు 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. కానీ మా యొక్క సమస్యలపై సమ్మెపై ఇంతవరకు ప్రభుత్వము గాని మున్సిపల్ అధికారులు గానీ ఇక్కడ…

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

మన న్యూస్ సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ అప్పలనాయుడు స్థానిక విలేకరుల అందించిన సమాచారం మేరకు మంగళవారం పట్టణంలోని ఎరుకల వీధిలో దాసరి సన్యాసిరావు ఇంటి వెనుక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు

ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు