ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి పటిష్ట చర్యలు.. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్

చైతన్యపురి , మన న్యూస్ :– రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ అన్నారు. శనివారం సరూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్య నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో లభించే సౌకర్యాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి పాఠశాల ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గురుకుల పాఠశాలలకు దీటుగా తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. నాణ్యమైన విద్య అందించడం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సారధ్యంలో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు దూరంగా ఉండాలని తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కవిత, ఉపాధ్యాయులు మధుసూదన్, శేఖర్ రెడ్డి, నారాయణ, బాలనరేందర్, వెంకటేష్, పద్మ, రోజారమణి, మరియమ్మ, విజయశ్రీ, శోభారాణి, లలిత, భాగ్యమ్మ, రాధ, స్వర్ణలత, అరుణ, డాక్టర్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : శనివారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర పశుసంవర్ధక మస్య యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీ…

మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా :శనివారం రోజు మక్తల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

పెరుమాళ్ళుపల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ జన్మదిన వేడుకలు

పెరుమాళ్ళుపల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ జన్మదిన వేడుకలు

నా పుట్టినరోజు ఇంత అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆరు ఎలక్ట్రిక్ బైక్స్ ఆరు ఎలక్ట్రిక్ సైకిలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

నా పుట్టినరోజు ఇంత అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆరు ఎలక్ట్రిక్ బైక్స్ ఆరు  ఎలక్ట్రిక్ సైకిలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

పాలసముద్రం తాళ్లూరి శివా ను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

పాలసముద్రం తాళ్లూరి శివా ను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.