మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ మాట్లాడుతూ, మొహరం పండుగ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని. ప్రజలంతా కుల మతాల కతీతంగా ప్రశాంత వాతావరణంలో పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు. పీర్ల దగ్గరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉత్సవ కమిటీ వాళ్లకు సూచించారు. పీర్ల చావడీల వద్ద, పీర్ల ఊరేగింపు సమయంలో నిర్వాహకులతో పాటు వాలంటీర్లను నియమించాలని సూచించారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ డైవర్షన్ తో పాటు, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ వారికి వ్యతిరేకంగా పోస్టులు చేయరాదని అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కూతుబ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మక్తల్ నియోజక వర్గం లొని అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో చేపట్టబోయే…

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తూర్కయంజాల్. మన న్యూస్ :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తూర్కయంజాల్ మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి ఆనుకోని తేజస్విని,సుకన్య నేతృత్వంలో చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బౌటిక్యూ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ వ్యాపారం లో రాణించి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

కార్మిక హక్కులు కోసమే సమ్మె

కార్మిక హక్కులు కోసమే సమ్మె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు