

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,యోగాను నిత్యజీవితంలో బాగము గా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హరిశ్చంద్ర , తిరుపతి, బాలరాజ్, లక్ష్మి కాంత్ రెడ్డి, రమేష్ గౌడ్, సులోచన, రాజేశ్వరి, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.