

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని, ఉన్నత చదువులు కోసం, ఆర్థిక సాయం అందజేత…..ప్రతి సంవత్సరం 30 వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనునట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణు గోపాల్ తెలిపారు. గద్వాల మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని సంధ్య, గద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. గత ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులు గాను, 991 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి , సమక్షంలో మాజీ మునిసిపాలిటీ చైర్మన్ జి. వేణుగోపాల్ , విద్యార్థిని ఉన్నత చదువులు కోసం ప్రతి సంవత్సరము 30,000 రూపాయలు ఇవ్వనున్నట్లు జి. వేణుగోపాల్ తెలిపారు. మొత్తం 4 సం.లకు అయ్యే ఖర్చుకు, మొత్తం 1 లక్ష, 20 వేల రూపాయలు. ఆర్థిక సాయం అందిస్తామని తెలిపిన మాజీ మున్సిపాలిటీ ఛైర్మెన్ జి. వేణు గోపాల్ . విద్యార్థికి ఆర్థిక సాయం అందించంగానూ గద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య , తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు.