

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్ : నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, మరియు జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ మండలంలో గత పది సంవత్సరాలుగా ఎగువ కమ్మ కండ్రిక ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వెంకటేశులు ను అకారణంగా , అన్యాయంగా తొలగించడాన్ని జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని దామోదరం నాయుడు, వెంకటేశులు నాయుడు, సోమశేఖర్ నాయుడు, మురళి నాయుడు అనువారు ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేయడానికి వీలు లేదని, అనేకమార్లు గొడవలు పడటం, అతని ఇబ్బంది పెట్టడం, అనేక సందర్భాల్లో చేశారని తెలిపారు. ఇక్కడ ఉంటే తెలుగుదేశం అయినా ఉండాలి, లేదా జనసేన అయినా ఉండాలని అతని విధులు అనేకమార్లు ఆటంకం కలిగించారని, దురుద్దేశపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం అందించారని ఈ సందర్భంగా తెలిపారు. అంబేద్కర్ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేషులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా కులం, మతం, ప్రాంతం, భాషల ప్రాతిపదికన విభజించి చూడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ కు జరిగిన అన్యాయాన్ని గౌరవ ప్రభుత్వ విప్ మరియు కూటమి ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పాలసముద్రం మండల అధ్యక్షుడు లతీష్, ఎస్ఆర్ పురం మండలం ఉపాధ్యక్షులు చార్లెస్, చందు, ప్రధాన కార్యదర్శి సురేష్, పుల్లూరు సర్పంచ్ పవన్, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి ప్రతాప్, మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, నియోజకవర్గ యువజన సంయుక్త కార్యదర్శి అన్నామలై, నియోజకవర్గం బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, యువజన నాయకులు చందు, జన సైనికులు పాల్గొన్నారు.
