

పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి చెందిన చిన్న హనుమంతు 10 నెలల కిందట వ్యవసాయ పొలానికి వెళ్తున్న సందర్భంలో ఉప్పల్ విజయ్ రెడ్డి బొలెరో వాహనం ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఆయనకు ఒక కాలు,చెయ్యి రెండు చోట్ల విరగగా, తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గాయపరిచిన వాహన యజమాని ఉప్పల్ విజయ రెడ్డి మీకు కావాల్సిన ఆస్పత్రికి అయ్యే ఖర్చులు 10లక్షల వరకు నేనే భరిస్తానని నాపై కేసు పెట్టొద్దని చెప్పగా బాధితులు అప్పటికి ఆలోచన చేసి సరే అని బదులిచ్చారు. అయితే ఉప్పల్ విజయ రెడ్డి అప్పటికప్పుడు లక్ష రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించగా, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని నమ్మబలికారు. అయితే దినం గడిచిన కొద్దీ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మిగతా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.అప్పటినుంచి బాధితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ మూడుసార్లు పెద్ద సమక్షంలో పంచాయతీలు పెట్టిన బాధితులకు ఎలాంటి న్యాయం జరగకపోగా ఈరోజు గద్వాలలో బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ విజయ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు.రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నా భర్తకు మతిస్థిమితం తప్పిందని, మా కుటుంబం రోడ్డున పడిందని, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ బాధితులు చిన్న హనుమంతు భార్య ఓబులమ్మ తేల్చి చెబుతున్నారు.