10 నెలల నుంచి బాధితులకు తీవ్ర వేధింపులు.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం నుంచి గద్వాలలోని ఉప్పల్ విజయ్ రెడ్డి ఇంటిముందు బైఠాయించిన బాధితులు.

పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి చెందిన చిన్న హనుమంతు 10 నెలల కిందట వ్యవసాయ పొలానికి వెళ్తున్న సందర్భంలో ఉప్పల్ విజయ్ రెడ్డి బొలెరో వాహనం ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఆయనకు ఒక కాలు,చెయ్యి రెండు చోట్ల విరగగా, తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గాయపరిచిన వాహన యజమాని ఉప్పల్ విజయ రెడ్డి మీకు కావాల్సిన ఆస్పత్రికి అయ్యే ఖర్చులు 10లక్షల వరకు నేనే భరిస్తానని నాపై కేసు పెట్టొద్దని చెప్పగా బాధితులు అప్పటికి ఆలోచన చేసి సరే అని బదులిచ్చారు. అయితే ఉప్పల్ విజయ రెడ్డి అప్పటికప్పుడు లక్ష రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించగా, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని నమ్మబలికారు. అయితే దినం గడిచిన కొద్దీ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మిగతా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.అప్పటినుంచి బాధితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ మూడుసార్లు పెద్ద సమక్షంలో పంచాయతీలు పెట్టిన బాధితులకు ఎలాంటి న్యాయం జరగకపోగా ఈరోజు గద్వాలలో బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ విజయ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు.రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నా భర్తకు మతిస్థిమితం తప్పిందని, మా కుటుంబం రోడ్డున పడిందని, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ బాధితులు చిన్న హనుమంతు భార్య ఓబులమ్మ తేల్చి చెబుతున్నారు.

Related Posts

పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ముందుగా ఉపాధ్యాయులను పూలు చల్లుతూ స్వాగతం పలికారు,సరస్వతి దేవి చిత్రపటం ముందు జ్యోతి సరిత టీచర్లు దీప…

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: ఆంద్రప్రదేశ్ లోని పాణ్యం దగ్గర మృతదేహం లభ్యం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కట్టుకున్న అలె కడ తెర్చిందా అనే కోణంలో దర్యాప్తు,మృతుడు ఆచూకీ లభ్యంతో అనేక అనుమానాలు…ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధలతో కట్టుకున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

  • By RAHEEM
  • June 23, 2025
  • 2 views
పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య