

కలిగిరి, మన న్యూస్ : కలిగిరి మండల పరిషత్ కార్యాలయం సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివారం కలిగిరి మండల ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ వాళ్లు నిర్వహించారు. గతంలో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని హైవే విస్తరణ పనుల్లో భాగంగా తొలగిస్తున్న నేపథ్యంలో నూతనంగా మరో గ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ లో నివసిస్తున్న పెద్దలు ఆంజనేయ స్వామి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి భూమి పూజ ను విజయవంతం చేయడం జరిగింది.