

మన న్యూస్, మనబోలు: *విద్యారంగంలో భారీ మార్పులు*ప్రతి బిడ్డ భవితను ఉజ్వలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా లోకేష్ అన్న అడుగులు. *వచ్చే వారమే అమలులోకి తల్లికి వందనం…ప్రతి బిడ్డకు రూ.15 వేలు. *ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.*మనుబోలులో లోటస్ వ్యాలీ స్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి టీడీపీ సమన్వయర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.కుటుంబసమేతంగా విచ్చేసిన రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన మనుబోలు వాసులు.సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…….మనుబోలులో చిన్నారుల స్కూలు ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అని అన్నారు.ప్రతి బిడ్డ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ అన్న అహర్నిశలు శ్రమిస్తున్నారు అని అన్నారు.ప్రభుత్వ స్కూళ్ల వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చారు. అత్యుత్తమ విద్యాబోధనకు మోడల్ స్కూల్ వ్యవస్థను అమలులోకి తెచ్చారు అని అన్నారు.మనుబోలు స్కూలు ఆవరణలో స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.గతంలో స్థానికంగా ఉన్న యూత్ క్లబ్ ను వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేశారు అని అన్నారు.క్రీడాకారులకు ఎంతో సౌకర్యంగా ఉన్న యూత్ క్లబ్ ను సిమెంట్ గోదాముగా మార్చారు అని అన్నారు.త్వరలోనే శాప్ చైర్మన్ రవినాయుడును ఆహ్వానించి ఆధునిక వసతులతో కూడిన స్టేడియం నిర్మాణానికి ప్రయత్నం చేస్తాం అని అన్నారు.శిథిలావస్థలో ఉన్న వసతి గృహ భవనాన్ని కూల్చివేయిస్తాం అని అన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని విస్మరించి అక్రమార్జనపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు అని అన్నారు.కూటమి ప్రభుత్వ హయాంలో అభివద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అని అన్నారు.మనుబోలులో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.



