

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు బృందావనంలో ఫోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ,ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి, ఎంపీలకు ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వైష్ణవి ,గోకుల్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ….. ప్రభుత్వం హెల్త్ కి అధిక ప్రియార్టీ ఇస్తుందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్ర పరిస్థితి బాగుంటుందని ఆకాంక్షించారు. ఈనెల 21 న అంతర్జాతీయ యోగా డే ని కూడా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారని తెలిపారు. న్యూరాలజి, పీడియాట్రిక్, న్యూయోనెటాలజి లతో ఆసుపత్రిని ప్రారంభించటం అభినందనీయమన్నారు. గతంలో కంటే నెల్లూరులో ఇప్పుడు వైద్య సేవలు మెరుగుపడ్డాయని మంత్రి నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు టిడిపి ముఖ్య నేతల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




