జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

మన న్యూస్, నెల్లూరు:* మహిళలను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగకోస్తాం.- నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన తెలుగు మహిళలు.- అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై మహిళల మండిపాటు .- నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళామణులు .- సాక్షి పేపర్ ను, టీవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ .అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించటంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకూ తెలుగు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళామణులు ముందుకు నడిచారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా సాక్షిని ప్రోత్సహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఖబర్ధార్ జగన్ అంటూ నినాదాలతో మహిళా మణులు నిరసనలు హోరెత్తించారు. అనంతరం తప్పుడు రాతలు రాసిన సాక్షిపై, తప్పుడు కూతలు కూసిన జర్నలిస్ట్ కృష్ణం రాజు, డిబేట్ నడిపిన కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వన్ టౌన్ పీఎస్ లో మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ ….మహిళలని కించపరిచేలా వ్యవహరించిన జగన్ అండ్కో ని శిక్షించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లు రాక్షసపాలన సాగించారని మండిపడ్డారు. దేవతల రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల మనోబావాలను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. జగన్ తనం బృందంతో కారుకూతలు కుయిస్తున్నారని ఎద్దేవ చేశారు. టీడీపీ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. పదకొండు సీట్లకే ప్రజలు పరిమితం చేసినా జగన్ కి ఇంకా బుద్ధి రాలేదంటూ తనదైన శైలిలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తీరు మారకుంటే నెక్స్ట్ ఒక్క సీటు కూడా రాదన్నారు. మహిళలను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగకోస్తామంటూ హెచ్చరించారు. ఏపీ పై విషం కక్కుతున్న సాక్షిపేపర్, టీవీ లను బాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , నగర అధ్యక్షుడు మామిడాల మధు , టిడిపి నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, కార్పొరేటర్లు, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర