


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చదువుతారు.ఈద్గాల వద్ద మత గురువులు ఇమాంలు ముందుండి నమాజులు చదివించారు.ప్రార్థనలు అనంతరం ఒకరినొకరు ఆ లింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.గ్రామాల్లో ముస్లిం సోదరులకు హిందూ సోదరులు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.గ్రామల్లో బక్రీద్ పండుగ వేడుకలు ప్రశాంతంగా జరుపుకుంటారు.
