రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలి , నకిలీ విత్తనాల దందాను అరికట్టాలి – సామాజిక కార్యకర్త కర్నె రవి

పినపాక, మన న్యూస్ :- మణుగూరు : తొలకరి ముందు గానే ప్రారంభమైనందున రైతులకు నాణ్య‌మైన‌ విత్తనాలు,ఎరువుల‌ ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్‌లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ,సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికారులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతోమాట్లాడారు .వానాకాలం సీజ‌న్ ప్రారంభ‌మైనందున రైతులు త‌మ వ్య‌వ‌సాయ భూము
ల్లో దుక్కులు దున్ని సిద్దంగా ఉన్నందున అన్ని ర‌కాల నాణ్య‌ మైన విత్త‌నాలను ప్రభుత్వం అందించాల‌న్నారు. న‌కిలీ విత్త‌నా ల‌ను అరిక‌ట్టేందుకు ప‌టిష్ట‌మైన విజిలెన్స్ మానిట‌రింగ్ సెల్ ఏర్పాటు చేయాల‌న్నారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి , వ్యవసాయ క్యాలెండర్ ప్రకటించి గ్రామాలలో పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల లో పంటలవారీగా ప్రణాళికను రూపొందించాలని కోరారు. రైతులకు అన్ని రకాల ఎరువులను, పురుగుల మందులను సబ్సిడీపై అందించాలన్నారు. పాసుబుక్కు కలిగిన ప్రతి రైతుకు ఖరీఫ్ సాగు కోసం పంట రుణాలు ఇవ్వా
లని డిమాండ్ చేశారు. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రభుత్వం రైతు భరోసా ను పాస్ బుక్ కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా నగదును బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసాను వెంటనే అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న భూభారతి అమలుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులఫై విస్తృత ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు . ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యమును అమ్మిన రైతులకు వెంటనే రైతు ఖాతాలలో డబ్బులను జమచేసి అన్ని రకాల ధాన్యముకు ప్రభుత్వ ప్రకటించిన బోనస్ ను ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే లైసెన్స్ లేని విత్తనా పురుగు మందు వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం కల్పించాల‌ని కోరారు.

Related Posts

బక్రీద్ పండుగ వేడుకలు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చదువుతారు.ఈద్గాల వద్ద మత గురువులు ఇమాంలు ముందుండి…

ఘనంగా ఎనుముల కొండల్ రెడ్డి జన్మదిన వేడుకలు

చంపాపేట్. మన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కర్ణాకర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

బక్రీద్ పండుగ వేడుకలు

  • By RAHEEM
  • June 8, 2025
  • 3 views
బక్రీద్ పండుగ వేడుకలు

కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి