పినపాక, మన న్యూస్ :- మణుగూరు : తొలకరి ముందు గానే ప్రారంభమైనందున రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ,సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికారులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతోమాట్లాడారు .వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులు తమ వ్యవసాయ భూము
ల్లో దుక్కులు దున్ని సిద్దంగా ఉన్నందున అన్ని రకాల నాణ్య మైన విత్తనాలను ప్రభుత్వం అందించాలన్నారు. నకిలీ విత్తనా లను అరికట్టేందుకు పటిష్టమైన విజిలెన్స్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి , వ్యవసాయ క్యాలెండర్ ప్రకటించి గ్రామాలలో పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల లో పంటలవారీగా ప్రణాళికను రూపొందించాలని కోరారు. రైతులకు అన్ని రకాల ఎరువులను, పురుగుల మందులను సబ్సిడీపై అందించాలన్నారు. పాసుబుక్కు కలిగిన ప్రతి రైతుకు ఖరీఫ్ సాగు కోసం పంట రుణాలు ఇవ్వా
లని డిమాండ్ చేశారు. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రభుత్వం రైతు భరోసా ను పాస్ బుక్ కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా నగదును బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసాను వెంటనే అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న భూభారతి అమలుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులఫై విస్తృత ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు . ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యమును అమ్మిన రైతులకు వెంటనే రైతు ఖాతాలలో డబ్బులను జమచేసి అన్ని రకాల ధాన్యముకు ప్రభుత్వ ప్రకటించిన బోనస్ ను ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే లైసెన్స్ లేని విత్తనా పురుగు మందు వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.