

గణపతి యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.
రాష్ట్ర ప్రభుత్వం తరపున భాధిత కుటుంబానికి ఆర్ధికసాయం అందజేత..
మన న్యూస్ ఐరాల జూన్-4:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాగంవాండ్లపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు గణపతి యాదవ్ మృతిదేహానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళ్ళు అర్పించారు. పొలం వద్ద నిద్రిస్తున్న గణపతి యాదవ్ పై నిన్న రాత్రి ఏనుగు దాడి చేసిన చంపేసిన విషయం తెలుసుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* నాగవాండ్లపల్లె గ్రామానికి చేరుకుని గణపతి యాదవ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం గణపతి యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపు నుంచి తక్షణ సాయం క్రింద 5 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. భాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏనుగు దాడి ఘటనపై అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్న ఏనుగుల గుంపులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపడంలో మరింత సమర్ధవంతంగా వ్యవహరించాలని అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణ సాయం క్రింద భాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ ను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేయడం జరిగిందని, రెండో విడతలో మరో ఐదు లక్షల రూపాయలు భాధిత కుటుంబానికి అందిస్తామని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు.
