ఏనుగుల‌ దాడిలో‌ మృతి చెందిన గణపతి యాదవ్ కు ఎమ్మెల్యే ‌మురళీమోహన్ నివాళి..

గణపతి ‌యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.

రాష్ట్ర ప్రభుత్వం తరపున భాధిత కుటుంబానికి ఆర్ధిక‌సాయం అందజేత..

మన న్యూస్ ఐరాల జూన్-4:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాగంవాండ్లపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు గణపతి యాదవ్​ మృతిదేహానికి పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్ నివాళ్ళు అర్పించారు. పొలం వద్ద నిద్రిస్తున్న గణపతి యాదవ్ పై నిన్న రాత్రి ఏనుగు దాడి చేసిన చంపేసిన విషయం తెలుసుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* నాగవాండ్లపల్లె గ్రామానికి చేరుకుని గణపతి యాదవ్‍ మృతదేహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం గణపతి యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపు నుంచి తక్షణ సాయం క్రింద 5 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. భాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏనుగు దాడి ఘటనపై అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్న ఏనుగుల గుంపులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపడంలో మరింత సమర్ధవంతంగా వ్యవహరించాలని అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణ సాయం క్రింద భాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ ను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేయడం‌ జరిగిందని, రెండో విడతలో మరో ఐదు లక్షల రూపాయలు భాధిత కుటుంబానికి అందిస్తామని పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్ తెలిపారు.

Related Posts

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

Mana News :- ఏపీ రాష్ట్ర చరిత్రలోనే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. వీరిలో వైకాపా సానుభూతి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమోషన్లలో ఎలాంటి తారతమ్యాలు కల్పించ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.కానీ ప్రభుత్వ ఉద్యోగులు…

భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): సృష్టికి ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ధిగాంచినవి పల్లె పట్టుకొమ్మలు… చక్కని ప్రకృతి లో వ్యవసాయం చేస్తూ, తమ పిల్లలను బడికి పంపుతున్న బుల్లి రోడ్లో పెద్ద పెద్ద వాహనాలు… గత కొన్ని సంవత్సరాలుగా భారీ లోడుతో నిత్యం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

బక్రీద్ పండుగ వేడుకలు

  • By RAHEEM
  • June 8, 2025
  • 3 views
బక్రీద్ పండుగ వేడుకలు

కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి