ఐరాల మండల ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కోసం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో అర్జీ

మన న్యూస్ ఐరాల జూన్-2

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో తేలికపాటి వర్షాలకు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన రోడ్డుపై నిరు ఉధృతంగా ప్రవహించడం, పలువురి ప్రాణాలను బలిగొనడం, రోజుల పాటు ప్రజలకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడం, విద్యార్థులు, పని కోసం పట్టణానికి వెళ్లే ప్రజలు, ప్రభుత్వ అధికారులకు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోకపోవడం బాధాకరం. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైనా ఈ సమస్యకు పరిష్కారం కలగాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ నరిగన్నగారి మరియు మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి తులసి బాబు జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో సమస్య తీవ్రతను తెలియజేసి పరిష్కారం అందించాలని, ప్రజలకు విద్యార్థులకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఫిర్యాదు చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార బృందం ప్రభుత్వం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటాం అని తిలియజేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి సమస్య జనసేన పార్టీ జనవాణి దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు సుపరిపాలన అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షులు బండారు మనోహర్, బంగారుపాలెం మండలం అధ్యక్షులు గంగసాని బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..