రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్సిపి తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో జరిగింది.. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కాకాణి పూజిత హాజర య్యారు.జూన్ 4వ తేదీ నియోజకవర్గాల్లో చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో విజయవంతంగా చేయాలని మేడ రఘు నాధ్ రెడ్డి సూచించారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టును మేడ రఘునాథ్ రెడ్డి ఖండించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4 వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. అందులో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. టిడిపి ఇచ్చిన అబద్ధపు హామీలతో మోసపోయిన ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్ల మీదకు వస్తే చొక్కా పట్టుకుని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి