రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్సిపి తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో జరిగింది.. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కాకాణి పూజిత హాజర య్యారు.జూన్ 4వ తేదీ నియోజకవర్గాల్లో చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో విజయవంతంగా చేయాలని మేడ రఘు నాధ్ రెడ్డి సూచించారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టును మేడ రఘునాథ్ రెడ్డి ఖండించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4 వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. అందులో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. టిడిపి ఇచ్చిన అబద్ధపు హామీలతో మోసపోయిన ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్ల మీదకు వస్తే చొక్కా పట్టుకుని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 5 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.