

మన న్యూస్,తిరుపతి :
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు లు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలో ప్రతినిత్యం వైసిపి నాయకులు కొంతమంది తిరుమలను అపవిత్రం చేసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
బీ ఆర్ నాయుడు ను మెమొరండమ్ అందజేసి ఆర్సి మునికృష్ణ కోరారు. బిఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్లి చర్చించి కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు. టీటీడీ చైర్మన్ ను కలిసిన వారిలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రుద్రకోటి సదాశివం, సుబ్బు యాదవ్ ధనుంజయ్ హేమంత్ కుమార్ లు ఉన్నారు.