సింగరాయకొండలో కౌలుదారు కార్డుల జారీపై అధికారుల సమీక్షా సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండల తహసిల్దార్ కార్యాలయంలో 30-05-2025న గ్రామ రెవిన్యూ అధికారులు, వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకుల సమక్షంలో కౌలుదారు కార్డుల జారీపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండల తహసిల్దార్ టి. రవి మాట్లాడుతూ, కౌలుదారు చట్టంలోని విధి విధానాల ప్రకారం గ్రామ వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు తమ గ్రామాల్లో సొంత భూమిలేని కౌలురైతులను గుర్తించి, వారి వివరాలను గ్రామ రెవెన్యూ అధికారులకు అందజేయాలని సూచించారు.అదేవిధంగా, మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో వాస్తవ కౌలురైతులను గుర్తించి వారికి మాత్రమే కౌలురైతు గుర్తింపు కార్డులు జారీ చేయాలని అధికారులు కోరారు. భవిష్యత్తులో సాగుదారు హక్కు పత్రం (CCRC) ఉన్న రైతులకు మాత్రమే పంట నమోదు, అన్నదాత సుఖీభవ, విత్తనాల పంపిణీ, సూక్ష్మ పోషకాల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని వివరించారు.ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు గ్రామ నాయకులతో కలిసి సాగుదారు హక్కు పత్రంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వాస్తవ సాగుదారులకు హక్కు పత్రాలు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి