

మన న్యూస్ తవణంపల్లె మే-30:- తవణంపల్లి మండలం కారకంపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో జీవించాలని ఆశీర్వదించిన పూతలపట్టు నియోజకవర్గం *మాజీ* శాసనసభ్యులు ప్రస్తుత ఇంచార్జ్ డాక్టర్.సునీల్ కుమార్. పై కార్యక్రమంలో ఐరాల మండల నాయకులు చిన్నారెడ్డి శాంతి సాగర్ రెడ్డి, నియోజకవర్గ డాక్టర్ల విభాగ అధ్యక్షులు మణిరాజ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.