

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి, గట్టు, మల్లకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన అనేకమంది భారత్ మాల హైవే రోడ్డు నిర్మించడానికి భూములు కోల్పోయారని అనేక గ్రామాల్లో నేటికీ సరైన మొత్తంగా నష్టపరిహారం అందలేదని అనేక చోట్ల అనేక గ్రామాల్లో నష్టపరిహారాల్లో పెద్ద ఎత్తున తేడాలు ఉన్నాయని భారత్ మాల హైవే నష్టపరిహార చెల్లింపుల్లో తీవ్రమైన విభేదాలు ఎందుకు ఉన్నాయో ఇప్పటివరకు అధికారులు చెప్పలేకపోతున్నారని గతంలో గ్రామంలో జరిగిన కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ విలువను బట్టి రెట్టింపు ఇస్తున్నారని చాలా గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు తక్కువగా ఉన్నాయని భూముల ధరలు మాత్రం అన్ని గ్రామాల్లో ఒకే రకంగా ఉన్నాయని మొత్తం జోగులాంబ గద్వాల జిల్లాను ఒక యూనిట్ గా పరిగణించాలని అన్ని గ్రామాల పరిహారాన్ని ఒకే రకంగా లెక్కించాలని లేకపోతే చిన్న గ్రామాలు భూముల కొనుగోలు ఎక్కువగా లేని అతి చిన్న గ్రామాలైన గంగి మాన్ దొడ్డి గట్టు తప్పేట్ల మొరుసు లాంటి గ్రామాలు ఎక్కువగా నష్టపోతున్నాయని మొదటి విడత డబ్బులు కూడా రాని గ్రామాలు ఉన్నాయని గంగిమనుదొడ్డి గట్టు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున అడిషనల్ కలెక్టర్కు లక్ష్మీనారాయణ కు వినతి పత్రము సమర్పించారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని ఈ నెలలోనే మొత్తం పరిహారము అందేటట్లు చూస్తానని లక్ష్మీనారాయణ గారు రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, కాంగ్రెస్ నాయకులు గట్టు గౌస్ మహబూబ్ బాషా, ఆల్ ఇండియా అంబేద్కర్ సంగం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్, అఖిలపక్ష కమిటీ నాయకులు గూడూరు రఘునాథ రెడ్డి, భారత్ మాల అధికారి భాష తదితరులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు