ఆధార్ కేంద్రం, ఆర్టీసీ బస్సు సర్వీసు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులతో మారిన గొడుగుచింత రూపురేఖలు

గొడుగు – చింత లేని గ్రామం..

“సొంత గ్రామంలో అభివృద్ధి వర్షం కురిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్..”

“ఎమ్మెల్యే చొరవతో ఆధార్ కేంద్రం‌ ఏర్పాటు..”

“అందుబాటులో ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వైపు అడుగులు..”

మన న్యూస్ పూతలపట్టు మండలం మే-9:- పూతలపట్టు మండలం, గొడుగుచింత గ్రామం ఇప్పుడు “నిజంగా గొడుగు – చింత లేని గ్రామంగా” మారుతుంది. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడం, అభివృద్ధి వైపు అడుగులు వేయడం వంటి కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. అందులో “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” స్వగ్రామం కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధతో అనేక మౌలిక సదుపాయాలు ప్రజల కోసం సమకూర్చుతున్నారు. గ్రామస్థులు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాలను గమనించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ మంజూరులతో పాటు తన వ్యక్తిగత శ్రద్ధతో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామానికి ఒక కొత్త రూపాన్ని తెచ్చి పెడుతుంది. “ముఖ్యంగా ఆధార్ సేవల కోసం ఎదురైన ఇబ్బందులు పరిష్కరించేందుకు గొడుగుచింత గ్రామంలో ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు”. గతంలో ఆధార్ సేవల కోసం ప్రజలు దూరంగా ఉండే పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, సమయం మరియు శ్రమ భరించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో గొడుగుచింతలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, కేవలం స్థానికులకే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆధార్ అప్డేట్, చిరునామా మార్పులు వంటి సేవలు సులభంగా అందుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభించి గ్రామాన్ని చిత్తూరు పట్టణంతో నేరుగా అనుసంధానించారు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు మరియు రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. సీసీ రోడ్లు, స్మశానానికి ప్రత్యేక రహదారి, మరియు వాటర్ ప్లాంట్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు గ్రామ రూపురేఖను పూర్తిగా మార్చేశారు. గొడుగుచింత గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్ సేవలను గ్రామస్థులు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!