

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 4:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ లో ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు గాంధీనగర్ మెయిన్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతారని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్ కనపర్తి గంగాధర్, 28వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చెక్క సాయి సునీల్, 29వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య, రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అస్లాం, టీడీపీ నాయకులు జిలానీ,మమతా రెడ్డి, పావళ్ళ ప్రసాద్, దామోదర్, గుద్దేటి భాస్కర్, దస్తగిరి, నారాయణ, నవీన్ రెడ్డి, గీతా కృష్ణ, మౌలాలి, ఖాదర్ భాష, సుధాకర్, సురేష్ రెడ్డి, దావూద్, కుమార్,అబ్దుల్ రజాక్, హుస్సేన్, యాకూబ్, శివ సాయి, నరేంద్ర, ఖాదర్, చోటు తదితరులు పాల్గొన్నారు.
