చవటగుంటలో మహాభారత ఉత్సవాలు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జనసేన ఇంచార్జ్ యుగంధర్ పాల్గొనడంతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ

వెదురుకుప్పం, మన న్యూస్ , మే 3: చవటగుంట గ్రామంలో శ్రీకృష్ణ ధర్మరాజుల 45వ మహాభారత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కి గ్రామ పెద్దలు మరియు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మోహన్ మురళి స్వయంగా డాక్టర్ థామస్‌ను ఆలయ నికి స్వాగతం పలికి తీసుకెళ్లారు. తదుపరి కార్యక్రమంలో చవటగుంట ద్రౌపతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఇందులో ఎమ్మెల్యేతో పాటు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పొన్న యుగంధర్, ఇతర కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. పూజల అనంతరం ఎమ్మెల్యే గ్రామ భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ మహాభారత ఉత్సవాల ఆధ్యాత్మికతను కొనియాడారు. ఉత్సవాలను ప్రతీ ఏడాది ఇంకా భవ్యంగా నిర్వహించాలని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి దైవదర్శనం చేసుకున్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..