గుజరాత్ vs కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

Mana News :- పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు (ఏప్రిల్ 21) టాప్ జట్టు అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది (KKR vs GT). వరుస విజయాలతో దూసుకుపోతున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది (IPL 2025). టీమ్ పరంగా చూసుకుంటే కోల్‌కతా బలంగానే కనిపిస్తోంది. అయితే ఎక్కువగా టాప్ ఆర్డర్ మీదనే ఆ జట్టు జయాపజయాలు ఆధారపడి ఉంటున్నాయి. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్, కెప్టెన్ అజింక్య రహానే రాణిస్తేనే ఆ జట్టు మెరుగ్గా ఆడుతోంది. మిడిలార్డర్‌లో వెంకటేష్ అయ్యర్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రాణించాడు. రింకూ సింగ్ ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక, బౌలింగ్‌లో మాత్రం కోల్‌కతా బలంగా కనబడుతోంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పరుగులను కట్టడి చేస్తూ వికెట్లు తీస్తున్నారు. అలాగే వైభవ్ అరోరా, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణాతో కూడా పేస్ దళం కూడా చక్కగానే రాణిస్తోంది. మరోవైపు గుజరాత్ ఏ ఒక్కరి మీదనో ఆధారపడకుండా సమష్టిగా రాణిస్తూ దూసుకుపోతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు ముందుకు వచ్చి జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ స్థిరంగా పరుగులు చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో జాస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే శుభ్‌మన్ గిల్, రూథర్‌ఫర్డ్ కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇక, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్, రషీద్ ఖాన్ చక్కగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను నిలువరిస్తున్నారు. ఇక, కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం అనే సంగతి తెలిసిందే. హై స్కోరింగ్ మ్యాచ్‌లకు అవకాశం ఎక్కువ. ఈ పిచ్‌పై ఛేజింగ్ కంటే మొదటి బ్యాటింగ్ చేయడం ఉత్తమం.తుది జట్లు: కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా): డికాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్ట్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి . గుజరాత్ టైటాన్స్ (అంచనా): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్‌ఫర్డ్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి