

మన న్యూస్, కావలి, ఏప్రిల్ 18 :సమస్య మీది పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అని అన్నారు.కావలి,39వ వార్డులో శుక్రవారం ఉదయం నుంచి పర్యటించిన కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు ఎక్స్టెన్షన్ ఏరియా కావడంతో భారీగా పేరుకుపోయిన సమస్యలు.ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న స్థానికులు.ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ……39వ వార్డు ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంది,గత ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ పుష్కలంగా కనిపిస్తోంది అని తెలిపారు.మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వ పాలకులు విఫలమయ్యారు.ఇక్కడ ఎక్కువగా విద్యుత్ సమస్యలు కనిపిస్తున్నాయి అని అన్నారు.రెండు నెలల్లో లో ఓల్టేజ్, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపిస్తాం అని తెలియజేశారు.అవసరం అయిన చోట ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు వేసి సమస్యను పరిష్కరిస్తాం అని తెలిపారు.అస్తవ్యస్తమైన లేఔట్ల వల్ల డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారింది,డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం అని తెలియజేశారు.ఈ ఏడాది చివరిలోపు 39వ వార్డులో సిమెంట్ రోడ్లు వేస్తాం,గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి చరమగీతం పాడుతాం అని తెలిపారు.కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం,సమస్య మీది – పరిష్కారం మాది అంటూ ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు,కావలిలో రామరాజ్యాన్ని నడిపిస్తాం సామాన్య, పేద ప్రజలు జోలికి వస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.
