నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్న బొజ్జల*-డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

శ్రీకాళహస్తి, మన న్యూస్: .తండ్రికి తగ్గ తనయుడుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలచేత మన్ననలు పొందిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు పేర్కొన్నారు.తన తండ్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్బంగా శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుధీర్ రెడ్డి చేస్తున్న గొప్ప కార్యక్రమంలో ఎల్లుండి, అనగా 15-04-2025 వ తేదీన, తొట్టంబేడు గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద గల యస్.యస్.కళ్యాణ మండపం దగ్గరకు విచ్చేయమని పలువురు నిరుద్యోగ యువతీ యువకులను కలిసి వివరించారు.మాజీ మంత్రి,స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన పరిపాలనా కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అనేక పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేసి, శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ఉద్యోగ కల్పనా కేంద్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, మైనారిటీ విభాగం నాయకులు సయ్యద్ చాంద్ బాషా, షేక్ జిలానీ, షేక్ రియాజ్, షేక్ జమీర్, ఇర్షాద్, షహాద్, మీర్జావలీ, ఫర్హా, యస్టీ విభాగం నాయకులు మునిరాజా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!