మహాత్మ జ్యోతిరావు పూలేకి భారతరత్న ఇవ్వాలిరాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ డిమాండ్

మన న్యూస్, తిరుపతి:నవ సమాజ నిర్మాత, కలియుగ వైతాళికుడు సమాజంలోని స్త్రీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, విద్య కోసం నిరంతరం కృషిచేసి సమాజ సేవలోనే అసువులు బాసిన మహాత్ముడు జ్యోతిరావు పూలేకి భారత ప్రభుత్వం దేశంలోని సర్వోన్నతమైన బిరుదు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఏసి ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు టి.గోపాల్ డిమాండ్ చేసారు. మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని బాలాజీ కాలనీలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వందలాదిమంది సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, మేధావులు, వివిధ పార్టీల నాయకులు మహాత్మ పూలేకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య తరఫున వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్, బీసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్ట భాస్కర్ యాదవ్, జాతీయ మేధావుల ఫోరం కన్వీనర్ డాక్టర్ వెంకటనారాయణ, జాతీయ బీసీ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా బర్త్డే కేకు కట్ చేసారు.ఈ సందర్భంగాటి గోపాల్ మాట్లాడుతూ దేశంలో ఎంతోమందికి భారతరత్న ఇచ్చారని 18వ శతాబ్దంలోనే సామాజిక విప్లవం తెచ్చి నవ సమాజ నిర్మాణం కోసం జీవితాన్ని అంకితం చేసి, బాల్య వివాహాల అరికట్టి, వితంతు పునర్వివాహాలు జరిపి, అనాధలు, ఆర్తుల కోసం సత్యశోధక సమాజాన్ని స్థాపించి నవ సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలేకి భారతరత్న ఇవ్వడం ఎంతైనా అవసరమని అన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్యను నేర్పించి భారత దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆమె ద్వారా బాలికలకు మహిళలకు విద్య నేర్పించి సామాజిక విప్లవాన్ని తెచ్చిన మహోన్నతుడని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల చైతన్యం కోసం అభ్యున్నతి కోసం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి మానవ విలువలు పెంపొందించిన మహనీయుడని చెప్పారు. ఈకార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?