రైతు సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. రైతు సేవ అధికారి ఎం నాగరాజు

మన న్యూస్; వైయస్సార్ కడప: సిద్ధవటం: ఏప్రిల్ 8 బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం , రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది.క్షేత్ర పర్యటన చేసి రైతుల సందేహాలను నివృత్తి చేయడం ,ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ – రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియ ను తనిఖీ చేసి సొంత భూమి కలిగిన ప్రతి రైతు కు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరడం జరిగింది.పసుపు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఎండిన క్వింటాల్ పసుపు కొమ్ములు రూ.10000/- కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు.పొలం లో నూర్పిడి చేస్తున్న పసుపు లో దుంప కుళ్ళు తెగులు గమనించడం,అది వ్యాప్తి చెందకుండా సాఫ్ పౌడర్ ను కుప్పల మీద చల్లాలి అని తెలిపారు.జూలై మొదటి వారం లో నాటేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ది చేసుకొవాలి. ట్రై కోడేర్మ విరిడి, బావి స్టి న్, డై థీన్ఎం 45 అనే తెగుళ్ల మందును వాడుకొని విత్తన శుద్ది చేసుకొవాలి.అలాగే పంట మార్పిడి కూడా చేపట్టాలి. రైతులు సాగు చేస్తున్న జనుము పంటను పరిశీలించి భూసార వృద్ధికి జనుము సాగు ప్రాధాన్యత వివరించటం ఒకే విత్తనము కాకుండా నవధాన్యాలు సాగు చేస్తే సుస్థిర భూసారాన్ని తద్వారా భూమి లోపల పొరల్లో ఉన్న అతి పెద్ద జీవ వైవిధ్యమును కాపాడ వచ్చు అని తెలిపారు.జీలుగ,జనుము, పిల్లి పెసర కలిపి కూడా పచ్చి రొట్ట ఎరువుగా వాడవచ్చు.అనంతరం నువ్వుల పంట సాగు దిగుబడుల,మార్కెట్ ధర గురించి ఆరా తీయడం జరిగిందని ఎకరాకు 3.50 క్వింటాల్ నుండి 5.50 క్వింటాల్ వరకు ఉందని మార్కెట్ ధర క్వింటాల్ కు రూ.12000/హ రైతులు తెలిపారు.అనంతరం మోదీన్ సాబ్ పల్లి గ్రామము లో దోస పంటను పరిశీలించి రైతులతో చర్చించడం జరిగింది.ఆదర్శ మహిళా రైతు శ్రీమతి దండే లక్ష్మీ కాంతమ్మ 5 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్న ఉద్యాన పంటలు మామిడి,జామ, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్,అంజూరా, ఖర్జూర, లిచ్చి, సీతాఫల్, రామ్ ఫల , అల్ల నేరేడు, చీనీ, నానో,సీమ ఉసిరి, వాక్కయ, వాటర్ యాపిల్ మొదలైనవి) అంతర పంటగా వేరుశనగ సాగు చేశారు.నూతన సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించుట కు ఆసక్తి చూపడం జరిగింది..వ్యవసాయ, అనుబంధ జీవనో పాదుల గురించి వివరించడం జరిగింది.రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని సుస్థిర ఆదాయం పొందేలా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రైతులు ఒంటిమిట్ట వెంకటేశు, అన్నిక దేవదాసు, వెంకట సుబ్బారెడ్డి,రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు బొగ్గిడి సందీప్, సింహ యాదవ్, ఝాన్సీ, ప్రేమ్, సందీప్ పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..