

మన న్యూస్; వైయస్సార్ కడప: సిద్ధవటం: ఏప్రిల్ 8 బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం , రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది.క్షేత్ర పర్యటన చేసి రైతుల సందేహాలను నివృత్తి చేయడం ,ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ – రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియ ను తనిఖీ చేసి సొంత భూమి కలిగిన ప్రతి రైతు కు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరడం జరిగింది.పసుపు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఎండిన క్వింటాల్ పసుపు కొమ్ములు రూ.10000/- కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు.పొలం లో నూర్పిడి చేస్తున్న పసుపు లో దుంప కుళ్ళు తెగులు గమనించడం,అది వ్యాప్తి చెందకుండా సాఫ్ పౌడర్ ను కుప్పల మీద చల్లాలి అని తెలిపారు.జూలై మొదటి వారం లో నాటేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ది చేసుకొవాలి. ట్రై కోడేర్మ విరిడి, బావి స్టి న్, డై థీన్ఎం 45 అనే తెగుళ్ల మందును వాడుకొని విత్తన శుద్ది చేసుకొవాలి.అలాగే పంట మార్పిడి కూడా చేపట్టాలి. రైతులు సాగు చేస్తున్న జనుము పంటను పరిశీలించి భూసార వృద్ధికి జనుము సాగు ప్రాధాన్యత వివరించటం ఒకే విత్తనము కాకుండా నవధాన్యాలు సాగు చేస్తే సుస్థిర భూసారాన్ని తద్వారా భూమి లోపల పొరల్లో ఉన్న అతి పెద్ద జీవ వైవిధ్యమును కాపాడ వచ్చు అని తెలిపారు.జీలుగ,జనుము, పిల్లి పెసర కలిపి కూడా పచ్చి రొట్ట ఎరువుగా వాడవచ్చు.అనంతరం నువ్వుల పంట సాగు దిగుబడుల,మార్కెట్ ధర గురించి ఆరా తీయడం జరిగిందని ఎకరాకు 3.50 క్వింటాల్ నుండి 5.50 క్వింటాల్ వరకు ఉందని మార్కెట్ ధర క్వింటాల్ కు రూ.12000/హ రైతులు తెలిపారు.అనంతరం మోదీన్ సాబ్ పల్లి గ్రామము లో దోస పంటను పరిశీలించి రైతులతో చర్చించడం జరిగింది.ఆదర్శ మహిళా రైతు శ్రీమతి దండే లక్ష్మీ కాంతమ్మ 5 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్న ఉద్యాన పంటలు మామిడి,జామ, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్,అంజూరా, ఖర్జూర, లిచ్చి, సీతాఫల్, రామ్ ఫల , అల్ల నేరేడు, చీనీ, నానో,సీమ ఉసిరి, వాక్కయ, వాటర్ యాపిల్ మొదలైనవి) అంతర పంటగా వేరుశనగ సాగు చేశారు.నూతన సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించుట కు ఆసక్తి చూపడం జరిగింది..వ్యవసాయ, అనుబంధ జీవనో పాదుల గురించి వివరించడం జరిగింది.రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని సుస్థిర ఆదాయం పొందేలా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రైతులు ఒంటిమిట్ట వెంకటేశు, అన్నిక దేవదాసు, వెంకట సుబ్బారెడ్డి,రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు బొగ్గిడి సందీప్, సింహ యాదవ్, ఝాన్సీ, ప్రేమ్, సందీప్ పాల్గొన్నారు.
