2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే… అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!

Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు. అప్పట్లో టీడీపీని ప్రత్యర్థి పార్టీలు ఓడించాయన్న వాదనతో ఆయన ఏకీభవించలేదు. ఈ ఓటమికి తానే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాజకీయ జీవితంలో తనను ఎవరూ ఓడించలేదని, గతంలో టీడీపీ ఎదుర్కొన్న పరాజయాలకు తానే కారణమని వెల్లడించారు. 2004, 2019 ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి తన పద్ధతులు, పనితీరు, ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పని, పని అంటూ తాను పని చేశానని, కానీ, కొన్ని కీలకమైన విషయాల్లో సమన్వయం లోపించడమే ఓటమికి కారణమైందన్నారు. అయితే తన విధానాలపైనే పూర్తి నమ్మకం ఉందని, ప్రజల కోసం నిరంతరం పని చేయడంలో ఎలాంటి రాజీపడనని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. రాజకీయంగా ఎదురైన ఓటములు తాను చేసిన పనులను కించపరిచేలా కాకుండా మరింత ముందుకు సాగేలా మార్పులే తెచ్చాయని సీఎం విశ్లేషించారు. ఎప్పటికీ ప్రజలతోనే ఉండాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కానీ, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడితే ఓటమికి ఆస్కారం ఉండదని చెప్పుకొచ్చారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///